*దీపావళి పూజా విధానం* - *ప్రణవపీఠాధిపతి బహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు నుంచి*
*ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణపరమాత్మ నరకాసురుడ్ని వధించడం వలన నరకచతుర్ధశి అయింది.*
*పరమపాపాత్ముడు నరకుడు నశించడం వల్ల జగత్తంతా ఆనందంతో ఆ మరునాడు అంటే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటారు.*
*బ్రహ్మ దేవుడు అమ్మవారిని లోకశ్రేయస్సుకోసం ప్రార్థించగా, ఏ ఇంటిలో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఆ ఇల్లు సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉంటాయని అమ్మవారు వరం ఇచ్చింది.*
*దీపావళి రోజు ఆవుపేడని తప్పకుండా గొబ్బేమ్మలుగా ఇళ్ళ ముందు పెట్టాలి.*
*దీపావళి రోజు అమ్మవారిని తామర పువ్వులు, ఎఱ్ఱకలువ పూలతో పూజించాలి.*
*ఈరోజు అమ్మవారిని మనస్పూర్తిగా అష్టోత్తరంతో, సహస్రనామాలతో లేదా శ్రీసూక్తంతో కుంకుమ పూజ చేయాలి.*
*అమ్మవారికి పూజలో ఈ రోజు మన దగ్గర ఉన్న ఆభరణాలు సమర్పించాలి.*
*పులిహోర, దధ్యన్నం, పాయసాన్నం ఈ రోజు అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి.*
*అమ్మవారికి ఈ రోజు నాలుగు ప్రదక్షిణలు చేయాలి.*
*సాయంత్రం వేళ గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి.*
*దీపాలు తొమ్మిది లేక పద్దెనిమిది లేక ఇరవై ఏడు ఆవిధంగా పెట్టాలి.*
*గోంగూర కాడలు నూనెలో నానబెట్టి, కాడకి వత్తి కట్టుకుని దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అని అంటూ కింద కొట్టాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు, దృష్టి దోషాలు పోతాయి*
*రాత్రి తిరిగి ఇంటి గుమ్మం దగ్గర హారతి వెలిగించి, కళ్ళకు అద్దుకుని గుమ్మం బయట పారవేసి, కళ్ళు, కాళ్ళు కడుక్కోవాలి.*
*దీపావళి నాడు స్వయంపాకం దానం చేసేవాళ్ళు పితృదేవతల యెుక్క అనుగ్రహం పొందుతారు.*
*సూర్యోదయం నుంచి, సూర్యాస్తమయం లోపు గురు దర్శనము చేసుకోవడం మంచిది.*
No comments:
Post a Comment